ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరుకావడంలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 03:26 PM

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికైనా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు పిరికిపందల్లా పారిపోతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.ప్రజలు తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి గెలిపిస్తే, సభకు రాకుండా ప్రతిపక్ష హోదా కావాలంటూ కాలయాపన చేయడంపై ఆయన మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో చేసిన స్కామ్‌లు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే వైసీపీ నేతలు శాసనసభకు ముఖం చాటేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. ఐదేళ్ల జగన్ పాలన చూసిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.చట్ట ప్రకారం అసెంబ్లీలో 10 శాతం సభ్యుల బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా కల్పిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని హితవు పలికారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa