టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టులో స్థానం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ఈ కేరళ ఆటగాడు, వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో భారత వికెట్ కీపర్గా అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కూడా సాధ్యం కాని ఈ ఘనతను సంజూ కేవలం 12 నెలల వ్యవధిలోనే సాధించడం విశేషం.ఒమన్తో అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ వల్లే భారత్ 188 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఒమన్ 167 పరుగులకే పరిమితం కావడంతో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ సంజూకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa