ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 1 నుండి రాజమండ్రి, తిరుపతి మధ్య అందుబాటులోకి రానున్న విమానయాన సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 05:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ముఖ్య నగరాలైన రాజమండ్రి, తిరుపతి మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. దసరా పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు ఇది శుభవార్త కానుంది. ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక చొరవతో ఈ కొత్త సర్వీసును ఏర్పాటు చేసినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని ఏపీడీ ఎన్‌కే శ్రీకాంత్‌ వెల్లడించారు. ప్రముఖ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ ఈ సర్వీసులను నడపనుంది. వారంలో మూడు రోజుల పాటు, అంటే ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విమానాలు రాకపోకలు సాగిస్తాయి. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 7:40 గంటలకు తిరుపతిలో విమానం బయలుదేరి 9:25 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరిగి రాజమండ్రిలో ఉదయం 9:50 గంటలకు బయలుదేరి 11:15 గంటలకు తిరుపతికి చేరుతుందని అధికారులు వివరించారు. ఈ కొత్త సర్వీసుతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa