ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు యువత కలలపై నీళ్లు చల్లిన ట్రంప్ నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 04:48 PM

అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలనే లక్షలాది మంది భారతీయుల ఆశలపై, ముఖ్యంగా తెలుగు యువత కలలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లింది. హెచ్‌1-బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుంది.ఇప్పటివరకు అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి హెచ్‌1-బీ వీసాలను ఒక మార్గంగా ఉపయోగించుకునేవి. అయితే, తాజా నిబంధనల ప్రకారం కంపెనీలు కేవలం లక్ష డాలర్ల ఫీజు చెల్లించడమే కాకుండా, ఆ ఉద్యోగికి ఏటా కనీసం 1.50 లక్షల డాలర్ల వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సగటున లక్ష డాలర్ల వార్షిక వేతనం ఇస్తుండగా, ఇప్పుడు ఫీజుకే అంత మొత్తం చెల్లించాల్సి రావడంతో కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంటోంది.ప్రతి ఏటా అమెరికా జారీ చేసే 85 వేల హెచ్‌1-బీ వీసాల్లో సుమారు 73 శాతం, అంటే దాదాపు 62 వేల వీసాలను భారతీయులే దక్కించుకుంటున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య 35 వేల వరకు ఉంటుందని అంచనా. తాజా నిర్ణయంతో వీరి అమెరికా ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa