ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశువుల కోసం హస్టళ్లు,,,ఏపీ సీఎం వినూత్న నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 07:54 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేక చర్యలు తీసుకుంటూనే.. పాలనలో సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూగజీవాల సంరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పశువుల కోసం హాస్టళ్లు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మూగ జీవుల సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పశువుల కోసం పట్టణాల్లో హస్టల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ వివరాలు..


స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యార్థులు, మహిళల కోసం ప్రత్యేకంగా హస్టళ్లు ఏర్పాటు చేశాము. ఇక మీదట పశువులకు కూడా హాస్టళ్లు నిర్మిస్తామని తెలిపారు. మున్సిపల్ పట్టణాల్లో పశువుల కోసం హస్టళ్లు ఏర్పాటు చేస్తామని వేదిక మీదుగా ప్రకటించారు.


పట్టణాలు, నగరాల్లో పశువులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తిరుగుతూ జనాలకు ఇబ్బంది కలిగించడమే కాక.. రోడ్డు మీద చెత్తా చెదారాలు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాయని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూగజీవాల ఆరోగ్యాన్ని కాపాడటమే కాక.. చిన్న, సన్నకారు పాడి రైతులకు మేలు చేసేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించచారు.


ఈ పశువుల హాస్టళ్లలో మూగజీవుల కోసం మేత, తాగునీరు, షెడ్లు వంటి ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పించనున్నారు. అలానే పట్టణ ప్రాంతాల్లో పశువులను పెంచుకుంటున్న వారు కూడా వాటిని సరిగా చూసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో వాటిని సంరక్షించడం కోసం హాస్టళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ హాస్టళ్ల వల్ల పశువులను సంరక్షించడమే కాక.. పట్టణాల్లో పరిశుభ్రత కూడా పెరుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


అయితే హాస్టళ్ల ఏర్పాటులో భాగంగా.. ముందుగా పట్టణాల్లో ఉన్న పశువులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎక్కడ ఎన్ని హాస్టళ్లు నిర్మించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. వాస్తవానికి చంద్రబాబు గతంలోనే పశువుల కోసం హాస్టళ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ హాస్టళ్లను నిర్మించాలని భావించారు. దీనిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో హాస్టళ్ల నిర్మాణానికి భూమి, నిధులు కూడా కేటాయించారు. అయితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో హాస్టళ్లను నిర్మించాలని ప్రతిపాదించారు.


పట్టణ ప్రాంతాల్లో పశువులు రోడ్ల మీద తిరుగుతూ.. ప్రమాదాల బారిన పడుతున్నాయి. అలానే వాటికి సరైన ఆహారం లభించక ప్లాస్టిక్ తింటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం వాటిని హాస్టళ్లకు తరలించి సంరక్షించాలని అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa