రామాయపట్నం పోర్టు పరిశీలనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పోర్టు పరిశీలనకు వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ బయలుదేరగా కందుకూరులో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోర్టు పరిశీలనకు అనుమతి లేదంటూ పోలీసులు వైయస్ఆర్సీపీ శ్రేణులకు ముందుకు వెళ్లకుండా అడ్డుతగిలారు. పోర్టు వైపు వెళ్లనీయకుండా టంగుటూరు టోల్ గేట్ వద్ద అడ్డగించడంతో మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ ఆందోళన చేపట్టారు. పోలీసు ఆంక్షలను ఛేదించుకొని టోల్ గేట్ నుంచి తిరిగి రామాయపట్నం పోర్టుకు బయల్దేరిన నేతలను హైవేపై పోలీసులు వెంబడించారు. దీంతో రామాయపట్నం పోర్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి నేతల ఒత్తిడితోనే పోలీసులు అడ్డుకుంటున్నారని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa