మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అంటూ ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం ఏపీ శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతుకుముందు వరుదు కళ్యాణిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అయితే తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడినప్పుడు సభలో బొత్స సత్యనారాయణ లేరని మంత్రి లోకేష్ గుర్తు చేశార. మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా? అంటూ బొత్సపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం తాము కాదంటూ వైసీపీ సభ్యులకు మంత్రి లోకేష్ చురకలంటించారు. ఆ క్రమంలో వైసీపీ సభ్యులకు నారా లోకేష్ సమాధానం ఇస్తూపై విధంగా స్పందించారు. ఒక తల్లి పడే ఆవేదన, బాధ తనకు తెలుసునని చెప్పారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa