ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 25, 2025, 06:04 PM

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దాదాపు 5వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డుకు సీఎం చంద్రబాబు సూచించారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు. ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa