రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. `చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారు. వైయస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడు. దానికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారు. వాటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు అమలు చేస్తున్నారు. వైయస్ఆర్సీపీలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరు. వైయస్ జగన్ ఎప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలకే కాదు, బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చు. అసలు మీ గురించి, నీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండి. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారు. ఇది కాదు పరిపాలన... తప్పుదారిలో వెళుతున్నామని మీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు` అని కన్నబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa