ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్యరాజ్యసమితి సమావేశంలో నెతన్యాహుకు ఎదురుదెబ్బ

international |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 02:31 PM

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు నిరసన ఎదురైంది. గాజాపై యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన కఠిన స్వరంతో ప్రకటిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేసి తమ వ్యతిరేకతను ప్రదర్శించారు. దీంతో ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగం వినిపించారు. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ ఒంటరవుతున్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలోనే మిత్రదేశమైన అమెరికా నుంచి కూడా ఆయనకు అనూహ్యమైన హెచ్చరిక ఎదురైంది. నిన్న ఐరాసలో ప్రసంగించిన నెతన్యాహు హమాస్‌పై యుద్ధాన్ని చివరిదాకా కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. "పాశ్చాత్య నేతలు ఒత్తిడికి తలొగ్గవచ్చు, కానీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గదు" అని ఆయన అన్నారు. ఇదే సమయంలో తన ప్రసంగాన్ని గాజాలోని ఇజ్రాయెల్ బందీలు వినేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అక్కడి ప్రజల సెల్ ఫోన్లను తమ నిఘా సంస్థల ద్వారా స్వాధీనం చేసుకొని ప్రసంగాన్ని ప్రసారం చేశామని నెతన్యాహు ఒక సంచలన ప్రకటన చేశారు. బందీలను ఉద్దేశించి, "మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు, ఇజ్రాయెల్ ప్రజలు మీకు అండగా ఉన్నారు" అని భరోసా ఇచ్చారు. "ఆయుధాలు వదిలేస్తే బతుకుతారు, లేదంటే వేటాడి చంపుతాం" అని హమాస్‌ను హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa