ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవీయ కోణంలో పనిచేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 08:54 PM

కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిబంధనల చట్రంలో చూడకుండా, మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల కన్నా మానవత్వమే ముఖ్యం అని స్పష్టం చేశారు. కొల్లేరు వాసుల కనీస అవసరాలైన తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనలో అటవీ శాఖ అధికారుల తీరుపై జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్రా ష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రుల ఎదుట ఏకరువు పెట్టారు. కొల్లేరు అభయారణ్యం పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీ శాఖ అధికారులు నిబంధనల పేరుతో అడ్డుపడుతున్నారని, కనీసం జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు కూడా హాజరుకావడం లేదని వారు ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa