పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట కఠిన నిర్ణయం తీసుకుంది. కలిసి జీవించలేమని తెలిసి, మరణంలోనైనా ఒక్కటిగా ఉండాలని భావించిన ఆ ప్రేమికులు.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాల్లో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన గోపి నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఆ కాలేజీలో చదువుతోన్న తెనాలి మండలం అత్తోటకు చెందిన ప్రియాంకతో గోపికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారి.. ప్రేమకు దారితీసింది.
ఈ విషయం గోపి, ప్రియాంక కుటుంబాలకు తెలియడంతో మందలించారు. అయితే, పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అందుకు వారు అంగీకరించలేదు. దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురైన గోపి, ప్రియాంకలు.. ఒకరిని వీడిచి ఒకరు ఉండలేమని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రేమ జంట కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకుని, పట్టాలపై అడ్డంగా పడుకున్నారు.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడు చేరుకున్నారు. ఘటనా స్థలిలో అత్యంత భయానక దృశ్యాలు చూసి వాళ్లు షాకయ్యారు. ఇరువురు తలలు, మొండెం నుంచి వేరుపడి అత్యంత భయంకరమైన స్థితిలో ఉన్నారు.
తల, మొండెం వెరుపడిప ఆ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. వారి కుటుంబాలకు సమాచారం అందజేశారు. విషయం తెలియగానే గోపి, ప్రియాంకల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాము పెళ్లికి ఒప్పుకోకపోతే ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈ సంఘటనతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని ఇలాంటి నిర్ణయం తీసుకుని, కన్నవారికి గుండెకోతను మిగిల్చిన ఈ ప్రేమికుల కథ ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa