ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి ఎల్లుండి నాటికి పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ వాయుగుండం శుక్రవారం ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వివరించారు.ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఓ వాయువ్య వ్యవస్థ కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతోనే ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సంజీవ్ ద్వివేది తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున, శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa