ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ జంటపై కన్నేసిన కీచకులు, బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 02:24 PM

చిత్తూరు నగరంలో గ్యాంగ్‌ రేప్‌ ఘటన  ఆలస్యంగా వెలుగుచూసి కలకలం రేపింది. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార,విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది.వివరాల్లోకి వెళ్ళితే....... పూతలపట్టు మండలానికి చెందిన ఓ బాలిక చిత్తూరులో ఇంటర్మీడియట్‌ చదువుకుంటోంది.గత గురువారం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మురకంబట్టు సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నీవా నగరవనం’ పార్కుకు వెళ్లింది. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్‌, మహేష్‌, కిశోర్‌ ఆ ప్రేమజంటను చూసి టార్గెట్‌ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫొటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు. ఆ ముగ్గురిలో ఒకరు ‘మా మేడం పిలుస్తోంది రా’ అని జంటలోని అబ్బాయిని దూరంగా పిలుచుకు వెళ్లగా మిగిలిన ఇద్దరు బాలికపై అత్యాచారానికి పాల్ప డ్డారు.తర్వాత మూడవ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా సోమవారం పార్కు వద్ద ఆ ముగ్గురిలో ఇద్దరికి దేహశుద్ధి చేసి చిత్తూరు తాలుకా పోలీసులకు అప్పగించారు.మరొకడు పరారయ్యాడు.ఈ నేపథ్యంలో సోమవారం బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ (18) ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు హత్యాయత్నం, రాబరీ, చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం వైసీపీ సోషల్‌ మీడియాలో గ్యాంగ్‌ రేప్‌ విషయం వైరల్‌ కావడంతో పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని వన్‌స్టా్‌ప సెంటర్‌కు తరలించారు.ఆమె ఫిర్యాదు మేరకు ఆ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు.పోక్సో, గ్యాంప్‌ రేప్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను అప్పటికే నమోదైన కేసుకు జత చేశారు. నిందితులకు సంబంధించి వైసీపీ సోషల్‌మీడియాలో రాజకీయ రంగు పులమడం వివాదాస్పదమైంది.ఈ నేపథ్యంలో డీఎస్పీ సాయినాథ్‌, సీఐలు మహేశ్వర్‌, శ్రీధర్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ ‘అత్యాచార ఘటనలో అలసత్వం, పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నాం.సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలి’అని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa