ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ హయాంలో నాకు తీవ్ర అవమానం జరిగింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 02:21 PM

జగన్ ప్రభుత్వంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వానిది విధ్వంస పాలన అని విమర్శించారు. ఇవాళ(శనివారం) పైడితల్లి అమ్మవారి పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.... వంశపారంపర్య ధర్మకర్తగా తాను రామతీర్థం వెళ్తే తీవ్ర అవమానానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని తాను ప్రశ్నిస్తే తనపై జగన్ హయాంలో అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. అప్పటి మంత్రుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఈవోలు పనిచేశారని విమర్శించారు. మాన్సాస్ సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రశ్నస్తే తనపై క్రిమినల్ కేసు పెట్టారని అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa