ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని నెల్లూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని డి.ఆర్.ఉత్తమ్ హోటల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ` ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షాలపై ఉంటుంది. పోరాటాలకు, విమర్శలకు పరిమితం కాకుండా, సమాజం పట్ల అందరం బాధ్యత వహించాలి. విద్య, వైద్యం అనేవి ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు అని మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిత్యం పర్యవేక్షించారు. నాడు నేడు పధకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత వైయస్ జగన్ది అని అయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa