ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల్లూరు నగరంలో దారుణం, హత్యకి గురైన ఇద్దరు వ్యక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 04:15 PM

నెల్లూరు నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. రంగనాయకులపేట తిక్కన పార్కు‌ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని యువకుల దారుణహత్యకు గురయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు. ఇద్దరు యువకులని దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన‌ స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు పేర్కొన్నారు. గ్రూపుల మధ్య పాతకక్ష్యలే కారణమనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa