ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ నో ఎంట్రీ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 04:58 PM

ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఓటర్లకు కాస్త ఇబ్బంది కలిగించే విషయం. ఆన్‌లైన్ చెల్లింపుల నుంచి అత్యవసర సమాచారం వరకు అన్నింటికీ ఫోన్లపైనే ఆధారపడే ఈ రోజుల్లో ఈ నిబంధన చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. అయితే, ఈ సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చక్కటి పరిష్కారం చూపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు కొత్త సంస్కరణలను ప్రకటిస్తూ, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు."ఓటర్లు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో తమ మొబైల్ ఫోన్లను భద్రపరుచుకోవచ్చు" అని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. దీనివల్ల ఓటర్లు ఎలాంటి ఆందోళన లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు. బీహార్ ఎన్నికలను ఆదర్శవంతంగా, అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని, శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa