ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్రామ్ క్షిపణులను పాకిస్థాన్‌కు ఇవ్వడంలేదు

international |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 07:50 PM

పాకిస్థాన్‌కు అత్యాధునిక గగనతల క్షిపణులను విక్రయిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై అమెరికా స్పష్టత నిచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ దేశానికి కొత్తగా అమ్రామ్ క్షిపణులను అందించడం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది కేవలం పాత ఒప్పందానికి సంబంధించిన సవరణ మాత్రమేనని వివరించింది.అమెరికా వార్ డిపార్ట్‌మెంట్ (డీవోడబ్ల్యూ) సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఓ ఆయుధ కాంట్రాక్టు ప్రకటనతో ఈ గందరగోళం మొదలైంది. సుమారు 251 కోట్ల డాలర్ల విలువైన ఈ కాంట్రాక్టులో క్షిపణులను కొనుగోలు చేసే 35 దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరు కూడా ఉండటంతో, ఆ దేశానికి కొత్తగా ఆయుధాలు అందుతున్నాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఈ వార్తలపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. "సెప్టెంబర్ 30న వార్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది ఒక పాత విదేశీ సైనిక అమ్మకాల ఒప్పందానికి సంబంధించిన సవరణ మాత్రమే. పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాలకు ఇప్పటికే ఉన్న క్షిపణుల నిర్వహణ, విడిభాగాల సరఫరా కోసమే ఈ సవరణ" అని స్పష్టం చేసింది. "ఈ ఒప్పంద సవరణలో భాగంగా పాకిస్థాన్‌కు కొత్తగా ఎలాంటి అమ్రామ్ క్షిపణులను అందించడం లేదు. వారి ప్రస్తుత సైనిక సామర్థ్యాన్ని పెంచే అప్‌గ్రేడ్‌లు కూడా ఇందులో లేవు" అని ఆ ప్రకటనలో వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa