ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 05:13 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది. ప్రజలు తమ సలహాలు, సూచనలను rushikonda@aptdc.inకు మెయిల్‌ చేయాలని టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి కోరారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమ్రపాలి తెలిపారు. ఆయా సంస్థల నుంచీ సూచనలు కోరుతామన్నారు. పౌరులు, సంస్థల నుంచి అందుకున్న సూచనలపై మంత్రుల బృందం సమీక్ష జరుపుతుందని వెల్లడించారు. అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమ్రపాలి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa