ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌కు భారత సైన్యం స్ట్రాంగ్ వార్నింగ్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 04:05 PM

భారత సైన్యం పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం జమ్మూలో వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మాట్లాడుతూ, పహల్గాం తరహా దాడి మళ్లీ జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. గతంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక పోస్టులను ధ్వంసం చేశామని, మరోసారి దుస్సాహసానికి పాల్పడితే భారత ప్రతిస్పందన కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన మాజీ సైనికుల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa