అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జేసీ వర్సెస్ కాకర్ల బ్రదర్స్ విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా తాడిపత్రిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి తన సొంత పార్టీకి చెందిన కాకర్ల సోదరులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాడిపత్రి నియోజకవర్గంలో కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అందుకే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానించారు. ఈ నిర్ణయంతో పార్టీలో నేతలు షాకయ్యారు. కాకర్ల సోదరులు పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆఱోపించారు. వీరు తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందని.. వారిని పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. తమను సస్పెండ్ చేసే అధికారం జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదన్నారట టీడీపీ నేత కాకర్ల రంగనాథ్. జేసీ ప్రభాకర్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారట. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడటంతో రాజకీయంగా కలకలం రేగింది. కాకర్ల సోదరుల భవిష్యత్ కార్యాచరణపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఏం చేస్తారోనని ఆసక్తికరంగా మారింది. ఈ అంశాన్ని అధిష్టానం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా చూడాలి.
తాడిపత్రిలో జేసీ, కాకర్ల సోదరుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వినాయక చవితి వేడుకల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఇరువర్గాలు తమ బలాన్ని ప్రదర్శించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కాకర్ల సోదరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేసీ ప్రభాకర్రెడ్డి టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అప్పట్లో కాకర్ల సోదరుల స్టిక్కర్లు ఉన్న వాహనాలను ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో హెచ్చరించారు.
ఈ పరిణామాల మధ్య కాకర్ల సోదరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జేసీ ప్రభాకర్రెడ్డి టీడీపీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం నుంచి స్పందన రాకపోవడంతో, జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా కాకర్ల బ్రదర్స్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అధినేత చంద్రబాబు ప్రమేయం లేకుండానే తాడిపత్రి టీడీపీ నేతలను జేసీ సస్పెండ్ చేయడం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే కాకర్ల బ్రదర్స్ నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్ కూడా ఉంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాడిపత్రిలో జేసీ వర్సెస్ కాకర్ల బ్రదర్స్ వర్గపోరుకు అధిష్టానం ఎలా పుల్స్టాప్ పెడుతుందో చూడాలి. కాకర్ల బ్రదర్స్ గతంలో టీడీపీలో ఉండేవారు.. ఆ తర్వాత వైఎస్సార్సీపీల ోచేరారు. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa