ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగ వేదపండితులకు నెలకు రూ.3 వేలు అందించనున్న టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 03:27 PM

నిరుద్యోగ వేదపండితులకు టీటీడీ ద్వారా సంభావన పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌ ఆఫీషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 600 మంది వేదపండితులకు సంభావన కింద ఈ శాఖ నెలకు రూ.3 వేలు అందిస్తుంది. ఇందుకోసం ప్రతినెలా రూ.2.16 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులను రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల నుంచి సమకూర్చస్తోంది. ఇది కొంచెం భారం కావడంతో ఈ పథకానికి టీటీడీ నిధులు కేటాయించాలని దేవదాయ శాఖ కమిషనర్‌ కోరారు. ఈ ప్రతిపాదనను టీటీడీ బోర్డు ఆమోదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa