ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన బీఆర్ నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 05:10 PM

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం ఏపీ రాజధాని అమరావతి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓ సాధారణ భక్తుడిలా ఆలయానికి చేరుకున్న ఆయన, అక్కడి నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించి పలు లోపాలను గుర్తించారు. ఆలయ సిబ్బంది పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, "ఈరోజు వెంకటపాలెం ఆలయాన్ని ఆకస్మికంగా సందర్శించాను. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లినప్పుడు ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలు నా దృష్టికి వచ్చాయి" అని తెలిపారు. స్వామివారి అలంకరణ మొదలుకొని సిబ్బంది ప్రవర్తన వరకు అనేక విషయాల్లో అలసత్వం కనిపించడం తనను ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు."భక్తుల సేవలో ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని బీఆర్ నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa