ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత యువకుడిపై పాశవికంగా దాడిచేసిన అగ్రవర్ణాల వ్యక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 10:09 AM

ఉత్తరప్రదేశ్‌లో కుల వివక్షకు సంబంధించిన అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. హమీర్‌పూర్ జిల్లాలో ఒక దళిత యువకుడిపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేసి, అతడితో బూట్లు నాకమని బలవంతం చేశారు. ఈ దాడిలో బాధితుడి చెయ్యి విరిగింది. అయితే, ఘటన జరిగి 12 రోజులైనా స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చివరికి జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది.సిమ్నౌడి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఉమేష్ బాబు వర్మ అక్టోబర్ 5న మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యలో అభయ్ సింగ్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి ఉమేష్‌ను అడ్డగించాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను చించివేయడంపై ఉన్న పాత గొడవను మనసులో పెట్టుకుని వారు కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారు."నన్ను కులం పేరుతో తిడుతూ, వాళ్ల బూట్లు నాకమని బలవంతం చేశారు. ఆ తర్వాత నాపై దాడి చేసి చేయి విరగ్గొట్టారు" అని బాధితుడు ఉమేష్ స్థానిక మీడియాకు తన ఆవేదనను వివరించాడు. దాడి తర్వాత న్యాయం కోసం స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. "చాలాసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను, కానీ నా ఫిర్యాదును ఎవరూ స్వీకరించలేదు" అని తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa