ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కు షాక్.. విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్

sports |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 10:27 AM

భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి వన్డేలో మాదిరిగానే, ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లీ సున్నా పరుగులకే అవుటయ్యాడు. బార్ట్‌లెట్ వేసిన 6.5వ ఓవర్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. డీఆర్‌ఎస్ కూడా తీసుకోకుండానే కోహ్లీ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 7 ఓవర్లకు భారత్ స్కోరు 17/2గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa