ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు భారత్ బంద్‌‌కు పిలుపు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 10:26 AM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు (శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 23 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa