ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసింది టీడీపీ నేత కాబట్టే కాపాడటానికి చూస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 12:20 PM

కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటనలో నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అతడిని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహ వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో అధికారపార్టీకి చెందిన నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాలకేయులుగా మారి మహిళలు, బాలికల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తాము ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన, అధికార పార్టీ తమను కాపాడుతుందని, కూటమి ప్రభుత్వం తమకే అండగా నిలుస్తుందనే ధీమా నిందితుల్లో పెరిగిపోయిందని అన్నారు.  తుని ఘటనలో బాలికపై నిందితుడు అత్యాచారయత్నం చేస్తే, దానిని చూసి సదరు నిందితుడిని పట్టుకున్న వ్యక్తిపైన పోలీసులు ఎదురుకేసు పెట్టారని అన్నారు. పట్టుకున్న వ్యక్తిపైనే ఫోక్సో కేసు పెడతామని బెదిరించారని, ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేయాలని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళనలకు దిగితే తప్ప, పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు. పట్టుకున్న తరువాత కూడా కేసును నిర్వీర్యం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa