ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ను భారీ లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఉత్సాహంగా కదిలాయి. భారత్, అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న సానుకూల అంచనాలు మదుపరులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు పెరిగి 85,154.15 వద్దకు చేరుకుంది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 188.6 పాయింట్లు లాభపడి కీలకమైన 26,000 మార్కును అధిగమించి 26,057.20 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, నిఫ్టీకి తక్షణ లక్ష్యం 26,186 వద్ద ఉందని, ఆశావాహ దృక్పథంతో 26,800 స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. అయితే, 25,780 వద్ద మద్దతు ఉందని, మార్కెట్ ఒక్కసారిగా పడిపోయే అవకాశాలు తక్కువని వారు విశ్లేషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa