విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కొనసాగుతోన్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాజాగా, ఎంపీపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2024 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ కోసం కేశినేని చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తాను మూడుసార్లు అకౌంట్ నుంచి ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశానని ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపించారు. ‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 8న రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు, పోరంకిలో కేశినేని పీఏ మోహన్ వచ్చి తీసుకెళ్లిన రూ.50 లక్షలు, గొల్లపూడిలోని తన స్నేహితుడు రూ.3.5 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఫేస్బుక్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
అకౌంట్ నుంచి మూడు దఫాలుగా బదిలీచేసిన రూ.60 వివరాలు ఇవేనంటూ ఆయన బాంబు పేల్చారు. గత కొన్నాళ్లుగా తిరువూరు టీడీపీలో వర్గపోరు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. తాను జగన్పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాని, లిక్కర్ కేసులో ఉన్న కసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన సొమ్ముతో కాదంటూ ఆయన వరుస పోస్ట్లు పెట్టడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఏపీ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాజధాని అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు.. తిరువూరు నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు, కొలికిపూడి ఆరోపణలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. ఆయన ఆరోపణల్లో నిజం లేదని, తాను ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, నా జేబులో డబ్బులే ఖర్చుపెడతానని అన్నారు. తానేంటే ప్రజలకు తెలుసన్న ఎంపీ.. ఆరోపణలకు కొలికపూడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఐదు, పది లక్షల కోసమే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని అధిష్ఠానం చూసుకుంటుందని, నేను ఎప్పుడూ రంగులు మార్చలేదని కౌంటర్ ఇచ్చారు.
అటు, ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే కొలికపూడి వ్యహారంపై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఇరువురూ అధిష్ఠానం ముందుకు రావాలని ఆదేశించింది. ఇక, ఎమ్మెల్యే వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న టీడీపీ పెద్దలు.. తిరువూరు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ చిన్నికి అప్పగించింది. అలాగే, కొలికిపూడిని చంద్రబాబు పిలిపించి, రెండు మూడుస్లారు క్లాస్ పీకారు? అయినా కూడా ఆయన మాత్రం తన వ్యవహారశైలి మార్చుకోలేదు. అప్పటి నుంచి ఇరువురి మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa