మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భారత జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించి న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 53 పరుగుల తేడాతో గెలిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత బ్యాటర్లు స్మృతి మంధాన (109), ప్రతీక రావల్ (122) శతకాలతో చెలరేగగా, కివీస్ బ్యాటర్లు బ్రూక్ హాలిడే (81), ఇసబెల్లా గేజ్ (65 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన కేవలం 95 బంతుల్లో 109 పరుగులు చేయగా, ప్రతీక రావల్ 134 బంతుల్లో 122 పరుగులతో నిలకడగా ఆడింది. చివర్లో జెమీమా రోడ్రిగ్స్ కేవలం 55 బంతుల్లోనే 76 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.భారత ఇన్నింగ్స్ 48వ ఓవర్ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించారు. అనంతరం న్యూజిలాండ్ లక్ష్య ఛేదనకు ముందు మరోసారి వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా నిర్ధారించారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుజీ బేట్స్ (1) వికెట్ను క్రాంతి గౌడ్ తీయగా, దూకుడుగా ఆడుతున్న జార్జియా ప్లిమ్మర్ (30)ను రేణుకా సింగ్ పెవిలియన్ పంపింది. ప్రపంచకప్ తర్వాత రిటైర్ కానున్న కెప్టెన్ సోఫీ డివైన్ (6) కూడా విఫలం కావడంతో కివీస్ 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అమేలియా కెర్ (45) కాసేపు పోరాడినా, ఆమె ఔటయ్యాక జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa