ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొంథా తుపానుపై షర్మిల స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:39 PM

మొంథా తుఫాను సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.తుపాను ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని షర్మిల సూచించారు. "ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే విషయంలో మన నాయకులు ముందుండాలి. ప్రాణనష్టం జరగకుండా చూడటం మనందరి బాధ్యత" అని ఆమె పేర్కొన్నారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే మన కర్తవ్యమని తెలిపారు.మరోవైపు, మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు చెరువులను తలపిస్తుండగా, అనేక లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa