ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను భారత్ ఓటమితో ప్రారంభించింది. తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 125 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మెల్బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆసీస్ బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా హేజిల్వుడ్ దెబ్బకు భారత టాప్ ఆర్డర్ కకావికలం అయింది. 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ అభిషేక్ శర్మ (68), హర్షిత్ రాణా (35) రాణించడంతో భారత్.. 100 పరుగుల మార్కును దాటింది. చివరకు 18.4 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్వుడ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. బార్ట్లెట్ 2, నాథన్ ఎల్లిస్ 2, స్టోయినిస్ ఒక వికెట్ తీశారు.
అనంతరం ఆస్ట్రేలియా మ్యాచ్ను ఎప్పుడెప్పుడు ముగిద్దామా అన్నట్లు బ్యాటింగ్ చేసింది. మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46 రన్స్), ట్రావిస్ హెడ్ (15 బంతుల్లో 28 రన్స్) రాణించడంతో ఐదు ఓవర్లు కూడా పూర్తికాకముందే 50 పరుగుల మార్కును చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైపోయింది. కానీ ఆస్ట్రేలియా విజయానికి ముంగిట భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీశారు. కానీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 13.2 ఓవర్లలో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ఫలితంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2 మ్యాచ్లు ముగిసే సరికి ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa