ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 02:40 PM

శ్రీకాకుళం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందారు.మృతుల్లో 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగ్రాతులని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. భక్తుల రద్దీతో రెయిలింగ్ ఊడిపడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరిపై ఒకరూ పడటంతో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనపై  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa