ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాతృభాషను అణగత్రొక్కేందుకే హిందీని రుద్దుతున్నారు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 04:53 PM

దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీష్ భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు హిందీ భాష విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసిస్తారని, మన దేశంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఇంగ్లీష్, హిందీ భాషలు పిల్లల నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతూ కేంద్రం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa