ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో అవకాశం ఇవ్వండంటూ ప్రజలకి సందేశాన్నిచ్చిన నితీశ్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 05:01 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ శనివారం ప్రజల కోసం ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2005 నుంచి తాను రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా, కష్టపడి సేవ చేశానని పేర్కొంటూ.. రానున్న ఎన్నికల్లో తమకే మరో అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ... "నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా, 2005 నుంచి నాకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మేము అధికారం చేపట్టే నాటికి బీహార్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఆ రోజుల్లో బిహారీగా చెప్పుకోవడం ఒక అవమానంగా భావించేవారు. అప్పటి నుంచి రేయింబవళ్లు నిజాయితీగా, కష్టపడి మీ కోసం పనిచేశాను" అని అన్నారు.గత ప్రభుత్వాలు మహిళల కోసం ఏమీ చేయలేదని, కానీ తమ ప్రభుత్వం మహిళలను ఎవరిపైనా ఆధారపడని విధంగా శక్తిమంతులుగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయం, యువతకు అవకాశాలు వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని వివరించారు. "హిందూ, ముస్లిం, అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు అనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల కోసం మేము పనిచేశాం. నా రాజకీయ జీవితంలో ప్రజల కోసమే పనిచేశా, కుటుంబం కోసం ఏమీ చేయలేదు" అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa