ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 11:39 AM

గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిపాలనకు సంబంధించి ఏకీకృత చట్టాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించకపోవడం, నాలుగు నెలల కోచింగ్‌తో ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఐటిఐలు, విశ్వవిద్యాలయాలను నవంబర్ లోగా పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రైవేటు కళాశాలలను నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానం చేసి, ప్రాంగణ నియామకాలకు హామీ ఇవ్వాలని, కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa