యూఏఈలో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడిని అదృష్టం వరించింది. దుబాయ్లో నిర్వహించిన ప్రఖ్యాత 'బిగ్ టికెట్' ఈ-డ్రాలో ఏకంగా పావు కిలో బంగారం గెలుచుకున్నారు. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.కేరళకు చెందిన నితిన్ కున్నత్ రాజ్, ఉపాధి నిమిత్తం 2016 నుంచి దుబాయ్లో నివసిస్తున్నారు. ఇటీవల ఆయన తన స్నేహితులతో కలిసి కొనుగోలు చేసిన టికెట్కు ఈ జాక్పాట్ తగిలింది. డ్రా నిర్వాహకులు నితిన్కు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఆయన తొలుత నమ్మలేదు. ఎవరో సరదాకి చేస్తున్నారని భావించారు. అయితే, వారు టికెట్ నంబర్ 351853 సహా పూర్తి వివరాలు చెప్పడంతో ఆశ్చర్యపోయారు.ఈ డ్రాలో ఆయన 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 250 గ్రాముల బంగారు కడ్డీని గెలుచుకున్నారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ టికెట్ను తాను మరో 10 మంది స్నేహితులతో కలిసి వేర్వేరు పేర్లతో కొనుగోలు చేశానని నితిన్ తెలిపారు. గెలుచుకున్న ఈ బహుమతిని వారందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa