ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసుని స్వీకరించిన ఎన్ఐఏ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 04:17 PM

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా స్వీకరించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పేలుడు ఘటన సూత్రధారులను వదిలిపెట్టబోమని, దర్యాప్తు సంస్థలు ఈ కేసు మూలాల్లోకి వెళ్లి నిందితులను పట్టుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హ్యుందాయ్ ఐ20 కారులో శక్తిమంతమైన పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, డిటోనేటర్లను ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకి అప్పగించదింది. ఈ కేసును చేతిలోకి తీసుకున్న వెంటనే ఎన్ఐఏ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతూ, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa