ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఉగ్రవాదినీ వేటాడండి.. ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:24 PM

ఎర్ర కోట సమీపంలో జరిగిన భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఉన్నతస్థాయి భద్రతా సమావేశం జరిగింది. ఢీల్లీ కారు పేలుడుపై వెనుక ఉన్న ప్రతి కుట్రదారుడినీ వేటాడాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. పేలుడుకు కారణమైన ప్రతి ఒక్కరూ.. భద్రతా సంస్థల పూర్తి ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే అమిత్‌ షా పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించారు.


ఎన్ఐఏ చేతికి దర్యాప్తు..


కాగా, ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోం శాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అ ప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ.. ఘటనా స్థలికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. పేలుడు సంభవించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు చర్యలు చేపట్టింది. సాక్ష్యాల సేకరణ, స్థానిక అధికారుల సమన్వయంతో.. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టింది. ఘటన వెనుక కుట్రను ఛేదించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ పేలుడుపై మొదటగా దిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేంద్రం దీన్ని ఉగ్రచర్యగా భావిస్తున్నందున.. దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగించారు. అయితే ఢిల్లీ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో ఫరీదాబాద్ డాక్టర్లకు సంబంధాలపై నివేదికలో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.


ఏ ఒక్కరినీ వదలం..


ఈ పేలుడు ఘటన జరిగిన తర్వాత భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి నుంచే కారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను చాలా బాధాతప్త హృదయంతో ఇక్కడికి వచ్చానట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. బాధితుల దుఃఖాన్ని తాను అర్థం చేసుకోగలనని ప్రధాని మోదీ అన్నారు. యావత్ దేశం బాధితులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తమ భద్రతా ఏజెన్సీలు ఈ కుట్ర వెనుక ఉన్నవారి అంతు చూస్తాయని పేర్కొన్నారు. బాధ్యుల్లో ఏ ఒక్కరినీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa