ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల భక్తుల మనోభావాలను చంద్రబాబు గాయపరుస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 12:54 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా  తిరుమల నెయ్యి విషయంలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారన్నారు.వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కొత్త గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేయబోయే ర్యాలీలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను డైవర్ట్‌ చేయడానికి ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బోలేబాబా సప్లై చేస్తున్న నేయిలో ప్రమాణాలు లేవని వచ్చిన పిర్యాదుపై పరిశీలన జరిపి, ఆ కంపెనీని బ్లాక్‌చేయించింది వైవీ. సుబ్బారెడ్డి అని,. ఇప్పుడు అలాంటి సుబ్బారెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారన్నారు. కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వైయ‌స్ఆర్‌సీపీని లక్ష్యంగా చేసుకునే ఇవన్నీ చేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa