అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాపై ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అనంతరం హెచ్1బీ వీసాదారులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అప్పటినుంచి హెచ్1బీ వీసాదారులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలు జంకుతున్నాయి. అయితే వీసా ఫీజు పెంపు నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ వ్యహాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యమ్నాయాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. వాల్స్ట్రీట్లోని పెద్ద పెద్ద కంపెనీలు.. తమ బ్యాక్ ఆఫీస్, టెక్నాలజీ కార్యకలాపాలను భారత్లో విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో అమెరికాలో.. ముఖ్యంగా స్టెమ్ నిపుణుల కొరత ఏర్పడింది. దీంతో ఆయా రంగాల్లో వేలాది మంది నిపుణుల కోసం.. అమెరికన్ కంపెనీలు భారత నగరాలపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మన దేశంలోని మెట్రో నగరాల్లో నియామకాలు ఇటీవల మరింత జోరందుకున్నట్లు నివేదిక పేర్కొంది. జేపీ మోర్గాన్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి దిగ్గజ ఇన్వెస్టిమెంట్ సంస్థలు.. అమెరికా బయట ఎక్కువ నియామకాలు చేపడుతున్నాయట. ఆయా కంపెనీలు అమెరికా కంటే ఎక్కువ మందిని.. భారత్లోనే నియమించుకుంటున్నట్లు తాజా నివేదిక తెలిపింది.
హైదరాబాద్లోనూ..
భారత్లో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్ నగరాల్లో.. ఆయా కంపెనీలు ఎక్కువ మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. గోల్డ్మాన్ శాక్స్ కంపెనీ.. లోన్ రివ్యూ డెస్కును మరింత విస్తరిస్తోందని.. అందులో భాగంగా లోన్ అనలిస్టు అసోసియేట్ల రోల్స్లో నియామకాలు పెంచిందని బ్లూమ్బర్గ్ కథనం ప్రచురించింది. అదే కోవలో హెడ్జ్ ఫండ్ మిలీనియం కంపెనీ.. మేనేజ్మెంట్ రిస్క్ అనలిస్టులను, జేపీ మోర్గాన్ సంస్థ.. క్రెడిట్ సపోర్టు స్పెషలిస్టులను, ఇక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ అండ్ కో.. మరింత మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్లు ఆ కథనం పేర్కొంది.
మరోవైపు, అనేక కంపెనీలు తమ గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ల సామర్థ్యాన్ని (జీసీసీ) రెట్టింపు చేస్తున్నాయని నివేదిక తెలిపింది. అందులో భాగంగా అమెరికాలో ఆన్సైట్లో పనిచేసేందుకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆయా రోల్స్ను భారత్లోని జీసీసీల్లో నియమించుకోవాలి చూస్తున్ననాయి.
కాగా, ప్రపంచానికి టెక్ నిపుణులను అందిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. అందుకే.. ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాల్ని భర్తీ చేసేందుకు విదేశాల నుంచి ప్రత్యేక నిపుణుల అవసరం ఉందని ట్రంప్ అంగీకరించారు. ఇలా ట్రంప్ స్వరం మార్చడం హెచ్1బీ వీసాదారులకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే. అయినా.. అమెరికా హెచ్1బీ వీసాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వీసా ఫీజు పెంపు.. భారత్కు ఒకింత మంచిదే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa