ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై అంశం బుధవారం పార్లమెంటరీ స్థాయి హోం వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే, చైర్పర్సన్ దీనిపై చర్చ జరపకమని నిరాకరించారు.విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఢిల్లీ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు లేవనెత్తేందుకు ప్రయత్నించారు. ఇంటెలిజెన్స్ విఫలమయిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, కమిటీ చైర్పర్సన్ రాధా మోహన్ దాస్ ఈ అంశంపై చర్చకు అనుమతించలేదు. సుమోటో ప్రకటనకు కూడా ఆమోదం ఇవ్వలేదు.విపత్తు నిర్వహణ (Disaster Management) ఎజెండా పై బుధవారం పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ మరియు హోం గార్డ్స్ డీజీలు పాల్గొన్నారు.26/11 నుంచి 10/11 వరకు జరిగిన పేలుళ్లలో మసూద్ అజార్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.జైష్ ఉగ్రకూటానికి సంబంధించిన కేసులో మహిళా డాక్టర్ నాయకత్వం వహించినట్లు పేర్కొన్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో ముఖ్య అంశాలు బయటకు వచ్చాయి.కాగా, మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఈ సమావేశంలో ప్రస్తావించబడ్డాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa