ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై పాఠశాలలోనే విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 01:58 PM

రాష్ట్రములోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ఆధార్ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా పాఠశాలల ప్రాంగణాల్లోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ ఆధార్ అప్‌డేట్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు.ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారికంగా లేఖ రాశారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలను (వేలిముద్రలు, కంటిపాప) అప్‌డేట్ చేయడంతో పాటు, పేరు, చిరునామా వంటి ఇతర వివరాలలో తప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారు చదువుకునే చోటే ఈ సేవలు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa