గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్జలాలు, వారికి పక్కా ఇళ్లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ దిశలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. రెండేళ్లు కోవిడ్ మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను వైయస్ఆర్సీపీప్రభుత్వం పూర్తి చేసిందని ఆయన తెలిపారు. నిన్న (బుధవారం) చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసి ప్రారంభించిన 3,00,092 ఇళ్లలో, గత ప్రభుత్వ హయాంలోనే 1,40,010 ఇళ్లు దాదాపు పూర్తి కాగా, శ్లాబ్ లెవెల్ వరకు 87,380 ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఇంకా వివిధ దశల పనులతో మిగిలిన 66,845 ఇళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. అయినా 3 లక్షల ఇళ్లు తామే కట్టినట్లు పచ్చి అబద్దాలతో సీఎం చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని, అందుకే ఆయన క్రెడిట్ చోర్ అనేది మరోసారి తేటతెల్లం అయిందని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన జి.శ్రీకాంత్రెడ్డి తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa