ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ మీద ఇటీవల టెస్ట్ సిరీస్లో అదరగొట్టిన యువ భారత్.. సొంత గడ్డపై మళ్లీ చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో.. 124 రన్స్ ఛేదించలేక 93 పరుగులకే పరిమితమైంది. దీంతో మరోసారి విమర్శల పాలవుతోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా.. భారత్పై భారత్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఓడించడం గమనార్హం. గతేడాది న్యూజిలాండ్.. మన గడ్డపైనే టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేయగా.. ఇప్పుడు సౌతాఫ్రికా కూడా భారత్ గడ్డపై భారత్ను భయపెడుతోంది. ఇక్కడ విపరీత టర్న్, బౌన్స్ అవుతూ వచ్చిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై.. మన స్పిన్నర్ల కంటే సౌతాఫ్రికా స్పిన్నర్లు మెరుగ్గా రాణించారని చెప్పొచ్చు. ఏ ఒక్క బ్యాటర్ కూడా వారిని తట్టుకొని ఎక్కువ సేపు నిలబడలేదు. ఈ క్రమంలోనే భారత మాజీ బ్యాటర్, మూడో స్థానంలో సుదీర్ఘ కాలం అడ్డుగోడలా నిల్చున్న ఛెతేశ్వర్ పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత బ్యాటర్ల వైఫల్యంపై స్పందించాడు.
ఈ ఓటమిపై స్పందించిన పుజారా.. ఇక్కడ చర్చ పిచ్ గురించి కాదని.. సన్నద్ధత గురించి మాట్లాడాలని అన్నాడు. భారత్.. త్వరగా తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలని సూచించాడు. ఎలాంటి టర్నింగ్ పిచ్పై అయినా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.
'ముందుగా.. టీమ్ మేనేజ్మెంట్ ఇలాంటి పిచ్నే కోరుకుందో లేదో మనకు తెలియదు. కానీ సర్ఫేస్ ఎలా ఉన్నా కూడా.. మీరు దానిపై ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాలి. దురదృష్టవశాత్తు.. శుభ్మన్ గిల్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్లో కూడా లేకపోవడం భారత్కు పెద్ద నష్టమే కలిగించింది.' అని పుజారా కీలక వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికా స్పిన్నర్లపై భారత బ్యాటర్లు ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారని.. ఇలాంటి వికెట్పై మంచి ఫుట్వర్క్ ఉండాలని.. గ్యాప్లో ఆడాలని అన్నాడు. 'భారత బ్యాటర్లు ఇలాంటి పిచ్లపై మెరుగ్గా ఆడేందుకు కొత్త మార్గం కనుగొనాలి. తమ ఫుట్వర్క్ ఉపయోగించి స్వీప్ షాట్లు ఆడాలి. సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయాలి. ఇలాంటి పిచ్లు ఆశించినప్పుడు బ్యాటింగ్ కోచ్ బ్యాటర్లతో మాట్లాడాలి. జట్టు సమావేశాల్లోనూ దీని గురించి చర్చించాలి. వ్యూహాలు రచించి మ్యాచ్లో అమలు చేయాలి.' అని అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa