శీతాకాలంలో చలి వాతావరణం కారణంగా దాహం తగ్గి, పని ఒత్తిడి లేదా సోమరితనం వల్ల మనం తక్కువ నీరు తాగుతుంటాము. అయితే, వేసవిలో మాదిరిగానే చలికాలంలో కూడా శరీరానికి సరైన హైడ్రేషన్ అవసరం. అందుకే చాలా మంది గోరువెచ్చని లేదా వేడి నీరు తాగాలని సూచిస్తుంటారు. శీతాకాలంలో శరీర జీవక్రియ (మెటబాలిజం) నెమ్మదిస్తుంది, చల్లటి నీరు తాగితే శరీరం మరింత చల్లబడి, దానిని వెచ్చగా ఉంచడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకే, గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం నిర్విషీకరణ (Detoxification) మెరుగుపడి, రక్త ప్రసరణ బలపడుతుంది, జీర్ణక్రియ మెరుగై, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 2.5 నుండి 3 లీటర్ల (సుమారు 8 నుండి 10 గ్లాసులు) నీరు గోరువెచ్చగా తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ నీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా, రోజంతా తక్కువ మొత్తంలో తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే, భోజనం మధ్యలో మరియు నిద్రపోయే 30 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం మంచిది. అయితే, రోజంతా మరీ వేడిగా ఉండే నీటిని తాగడం సరైన పద్ధతి కాదు. నీరు చాలా వేడిగా ఉంటే, అది అంతర్గత శరీర కణజాలాలను దెబ్బతీసి, గొంతు లేదా కడుపు లైనింగ్ను కాల్చే ప్రమాదం ఉంది. అందుకే, నీటిని మరిగే కంటే గోరువెచ్చగా తాగడమే శ్రేయస్కరం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa