గత నాలుగు రోజులుగా చలి పంజా విసరడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడంతో, సాయంత్రం చీకటి పడగానే ప్రజలు తలుపులు, కిటికీలు మూసేస్తున్నారు; రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి తగ్గడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతల్లో వచ్చిన భారీ పతనం ప్రజలను అల్లాడిస్తోంది. ఈ నెల 14న 17 డిగ్రీలుగా ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రత, మరుసటి రోజే ఏకంగా 2.4 డిగ్రీలు పడిపోయి 15.6 డిగ్రీలుగా నమోదైంది. సోమవారం రోజున మహబూబ్నగర్ జిల్లాలో అత్యల్పంగా 14.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ తీవ్ర చలి కారణంగా నగరంలో రాత్రి 8 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి, మరియు ఉదయం ఏడు గంటలు దాటితే గానీ ప్రజలు తలుపులు తెరవడం లేదు. మార్నింగ్ వాకర్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది, సూర్యుడు వచ్చాకే కొందరు బయటికి వస్తున్నారు. చలికి అదనంగా, తెల్లవారుజామున భారీగా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, మంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa