తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం చికెన్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. కార్తీక మాసం ముగిసిన నేపథ్యంలో నాన్వెజ్ తినే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీంతో షాపుల్లో క్యూ కట్టిన జనాలు, రోజువారీ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గత రెండు వారాలుగా ధరలు పెద్దగా మార్పు లేకపోయినా, డిమాండ్ పెరిగితే రూ.10–20 వరకు పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ కేజీ రూ.220 వద్దే స్థిరంగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో రూ.215 నుంచి రూ.225 మధ్యలో లభిస్తోంది. చిత్తూరు జిల్లాలోని పలు మార్కెట్లలో రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సగటు ధర రూ.220–230 మధ్యలోనే ఉంది.
మటన్ ధరలు మాత్రం ఇప్పటికీ ఆకాశమే తాకుతున్నాయి. రూ.800 నుంచి రూ.900 వరకు కేజీ ఉండటంతో సామాన్యులు దూరంగానే ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రూ.950 వరకు కూడా పలుకుతుండటం గమనార్హం. చికెన్కు బదులుగా మటన్ కొనాలని చూసే వారు ధర చూసి వెనక్కి తగ్గుతున్నారు.
అయితే కోడిగుడ్ల ధరలు ఊరటనిచ్చాయి. ఒక్కో గుడ్డు రూ.7కే దొరుకుతోంది. కొన్ని చోట్ల రూ.6.50–6.80కి కూడా అమ్ముతున్నారు. కార్తీక మాసం తర్వాత చికెన్ డిమాండ్ బాగా పెరగడంతో రానున్న రోజుల్లో రేట్లు కొంచెం ఎగసిపడే అవకాశం ఉంది. మీ ఏరియాలో ఇవాళ చికెన్ రేటు ఎంత ఉంది? కామెంట్లో చెప్పండి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa