రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.పంట నష్టం జరగకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తిచేసిన రైతులు, తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం తరఫున రైతులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa